14-11-2025 11:15:35 PM
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటవీ భారీ విజయం సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అఖండ విజయాన్ని సాధించింది. ఏకంగా 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుని డబల్ సెంబరీ కొట్టింది. మొత్తం 243 సీట్ల 203 సీట్లలో గెలుపొందగా, మహగఠ్ బంధన్ కూటమీ 35 పరిమితమైంది. ఎన్డీఏ కూటమీ లోని బీజేపీ (90), జేడీయూ (85), ఎల్జేపీ(ఆర్వీ) (19), హెచ్ఏఎం(ఎస్) (5), ఆర్ఎల్ఎం (4) స్థానాల్లో విజయం సాధించాయి. కాగా, మహగఠ్ బంధన్ కూటమీ లోని కాంగ్రెస్ (6), ఆర్జేడీ(25), సీపీఐ(ఎంఎల్) (2), సీపీఎం (), ఐఐపీ (1) సీట్లలో గెలుపొందింది. 2020 బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లు సాధించగా, 2025 ఎన్నికల్లో కేవలం 25 సీట్లు గెలుచకుంది. ఏకంగా 50 స్థానాలను కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 19 నుంచి ప్రస్తుతం 6 స్థానాలకే పరిమితమైంది.