16-02-2026 12:24:03 AM
తాండూరు, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ లో వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రావడంతో చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ కు తెరపడింది.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్ణయం మేరకు నీరజ పేరును ఖరారు చేశారు.. అయితే ప్రధానంగా విధేయతే ప్రామాణికంగా చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక జరిగిందని తెలిసింది.
కౌన్సిలర్ గా హ్యాట్రిక్ విజయం సాధించిన 12వ వార్డు కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి కే చైర్ పర్సన్ పీఠం ఛాన్స్ దక్కింది.. గతంలో ఆమె అధికార, విపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై అనర్ఘళంగా అధికారులను, పాలకులను నిలదీసి గళమెత్తారు. మున్సిపల్ పాలన తీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న నీరజకె చైర్ పర్సన్ పీఠం దక్కింది.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు తాజాగా గెలుపొందిన మెజారిటీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు సైతం నీరజ వైపే మొగ్గు చూపించడంతో ఆమె పేరును ఖరారు చేశారు. సోమవారం జరిగే ప్రమాణ స్వీకారం నీరజ బాల్రెడ్డి చైర్పర్సన్ గా ప్రమాణం చేయనున్నారు.