04-06-2025 12:21:08 AM
- ఎర్రని ఎండను తట్టుకోలేక చెట్లకిందకి జనాలు
- చంటి పిల్లలతో వచ్చిన మహిళలకు తాగేనీళ్లేవి..!
- రైతు సదస్సులోనూ రైతులకు దక్కని గౌరవం
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 03: రెవెన్యూ సదస్సు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన రైతులకు, మహిళలకు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం రైతు నివేదిక అవరణలో రైతు సదస్సుతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.
రైతులు, లబ్దిదారులు ఉదయం 10:30 వరకే విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు గా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన రైతులు, కళ్యాణలక్ష్మీ, షాదీముబాకర్ లబ్దిదారులు నానా అవస్తలు పడ్డారు. దీనికి తోడు ఎండల తీవ్రత మరింత ఉంది. స్థలం సరిపోకపోడంతో చెట్ల కింద వెళ్లి తలదాచుకున్నారు. ప్రజలు ఇవ్వేమి ఏర్పాట్లని అధికారులను నిల దీశారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కుల కోసం మహిళలు చంటి పిల్లలతో వచ్చారు.
కనీసం మంచినీళ్లైనా సరిపడా తెప్పించలేదు. అసలే ఎండాకా లం.. తాగేనీళ్లు ఏర్పాటు చేయకపోతే ఎలాని ప్రశ్నించారు. మాజీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు, సామాన్యలకు, అక్కడివచ్చిన లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో అనే కమైన అవస్తలు పడ్డారు. రైతు సదస్సులోనూ రైతులకు గౌర వం దక్కలేదు. రైతు నివేదిక హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. రెవెన్యూ సద స్సుకు వచ్చిన రైతుల పరిస్థితి చాలా దారుణం. కనీసం నిలబడానికి స్థలం లేకపోవడం బాధకారమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.