04-06-2025 12:19:08 AM
- ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
- చేవెళ్లలో ‘ఆపరేషన్ సిందూర్’ విజయోత్సవ ర్యాలీ
చేవెళ్ల, జూన్ 3: ‘ఆపరేషన్ సిందూర్ ‘ తో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసిన దేశ త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నానని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మంగళ వారం చేవెళ్ల లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతలు తెలిపి, దేశ ఐక్యతను చాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చి, దేశ భద్రతను కాపాడిందని కొనియాడారు.దేశ విధ్వంసం కోరే వారికి ఇక్కడ స్థానం లేదని , అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో , మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం , చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు మున్నూరు శ్రీకాంత్, మొయినాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, షాబాద్ మండల అధ్యక్షుడు మనయ్య, శంకరపల్లి మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, నవాబుపేట మండల అధ్యక్షుడు చంద్రకాంత్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పాండురంగ రెడ్డి, వైభవ్ రెడ్డి, గణేష్, కుంచం శ్రీనివాస్, శర్వలింగం, ఆడెట్ల శ్రీనివాస్, ఇంద్రసేన రెడ్డి, కుమార్ గౌడ్, అశోక్, వెంకట్ రామ్ రెడ్డి, కృష్ణ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, జై శంకర్ తదితరులుపాల్గొన్నారు.