20 March, 2026 | 10:11 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

శంకర్‌పల్లి - వికారాబాద్‌కు కొత్త బస్సు ప్రారంభం

20-03-2026 12:00 AM

శంకర్ పల్లి, మార్చి 19 (విజయక్రాంతి): శంకర్ పల్లి మరియు వికారాబాద్ ప్రాంతాల ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. శంకర్ పల్లి పట్టణం నుండి పర్వేద, గంగ్యాడ, పూలపల్లి గ్రామాల మీదుగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కొత్త బస్సు సర్వీసును చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేనా భీమ్ భరత్ గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్  భీమ్ భరత్ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో పల్లెలు పయనిస్తున్నాయని, ప్రజా రవాణాకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో  సర్పంచ్ సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండి. నసీరుద్దీన్, రామాలయ కమిటీ చైర్మన్ అనంతరెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, విష్ణు కాంత్ రెడ్డి, అనిత ఆనంద్ గౌడ్, పద్మజ అనంతయ్య, సుభాన్ రెడ్డి, వెంకటేశం, రాములు, బుచ్చయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.