మల్లారెడ్డి కల్పన 50వ వివాహ వేడుకలు
మాది ఫేమస్ జంట : ఎమ్మెల్యే మల్లారెడ్డి
సికింద్రాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలందరికి మల్లారెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే ఉగాది రోజున మంచి భార్య కల్పనతో తాడుబండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో వివాహం జరిగిందని మల్లారెడ్డి అన్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర కల్పన మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ (గోల్డెన్ జూబ్లీ) సందర్బంగా బోయిన్ పల్లి జయనగర్ లోని శ్రీ సాయి బాబా, తాడుబందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకలలో పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించిమల్లారెడ్డి కల్పన దంపతులకు 50వ వార్షికోత్సవాన్ని శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 50 కిలోల భారీ కేక్ కటింగ్, గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.




