నాగోల్లో నూతన స్కేటింగ్ గ్రౌండ్ ప్రారంభం
ఆనంద్నగర్లో ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్
నాగోల్, జూలై 12 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్ గ్రౌండ్ను తాజా మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి క్రీడా వేదికలు యువతలోని ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.
స్థానిక యువత ఈ స్కేటింగ్ గ్రౌండ్ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రాస్ స్కేటింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కన్నబోయిన యాదయ్య, డైరెక్టర్ బందారం సాయి ప్రసాద్, క్రీడాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు, పాల్గొన్నారు.






