27-06-2025 01:37:42 AM
వారసిగూడ, జూన్ 26 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ : జీహెచ్ ఎంసీ. సికింద్రాబాద్ సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం నూతన అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏ.సీ.పీ) గా పదవీ బాధతలు స్వీకరించిన శ్రీమతి పావని గురువారం సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్తో సమావేశమయ్యారు. సితాఫలమండీ లోని ఎమ్మె ల్యే క్యాoపు కార్యాలయంలో ఆమె పద్మారావు గౌడ్ ను కలిశారు.
పట్టణ ప్రణాళికా విభాగం కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజలకు తమ సేవలు అందుబాటులో నిలపాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పావనికి సూచించారు. కార్యక్ర మంలో కార్పొరేటర్ సామల హేమ తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.