10 April, 2026 | 7:28 PM

Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •  

నవ దంపతులను కాటేసిన మృత్యువు

20-12-2025 10:52 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నూతన వధూవరులు(Newly Married Couple) శుక్రవారం వంగపల్లి, ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు నుండి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. బాధితులను కె. సింహాచలం (25), అతని భార్య భవాని (19)గా గుర్తించారు. ఈ దంపతులు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా, రవుపల్లి గ్రామానికి చెందినవారు. వారికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది.

హైదరాబాద్‌లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే సింహాచలారం, జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. విజయవాడలో ఉన్న తమ బంధువులను కలవడానికి ఈ దంపతులు గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కారు. వారు తలుపు దగ్గర నిలబడి ఉండగా, ప్రమాదవశాత్తు అక్కడి నుండి జారిపడి వంగపల్లి సమీపంలో మరణించారు. శుక్రవారం నాడు ట్రాక్‌మెన్‌లు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.