20 March, 2026 | 9:21 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఈనెల 21న జరిగే ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పాల్వంచ మండల, పట్టణ 5వ మహాసభలు

18-07-2025 11:07 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) మహాసభలు విజయవంతంకై శుక్రవారం పాల్వంచ సిఆర్ భవన్ (సిపిఐ కార్యాలయం)లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ వీసంశెట్టి పద్మజ మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలు రకరకాల హింసలు పెరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగంలో మహిళలకు అనేక రకాల హక్కులు ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో నిర్భయ, దిశ చట్టాలు వచ్చినప్పటికీ మహిళలకు భద్రత కరువైందన్నారు. 

పాలక ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే ఈ హింస ఇంకా పెచ్చరిల్లుతున్నదన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని, మహిళల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజా పోరాటాలను నిర్వహిస్తూ ఎన్నో విజయాలు సాధించిన భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) పాల్వంచ మండల, పట్టణ 5వ మహాసభలు ఈనెల 21న పాల్వంచలో జరగనున్నాయని, ఈ మహా సభలకు పాల్వంచ మండల, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.