17-06-2025 12:03:27 AM
కొత్త విద్యాశాఖ డైరెక్టర్ను కలిసిన టీచర్ సంఘాల నేతలు..
హైదరాబాద్ (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్(Naveen Nicholas) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టీజీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఆయనను ఇటీవలే ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు సంఘాల నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఖాళీలున్నంత మేరకు ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతులు ఇవ్వాలని కోరారు. రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కొత్త డైరెక్టర్ చెప్పినట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, దామోదర్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్ను కలిసిన వారిలో టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రవి, వెంకట్, టీఆర్టీఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రమేష్, అంజిరెడ్డి తదితరులున్నారు.