17-06-2025 12:05:23 AM
ఎమ్మెల్యే మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, జూన్ 16 : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు తూడి మెఘా రెడ్డి, అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్ర జావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ రోజు ప్రజావాణికి మొత్తం 90 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఏకకాలంలో రైతు భరోసా చారిత్రాత్మక ఘట్టం
వనపర్తి మండలం, జూన్ 16 : రైతు సంక్షేమమే పరమావధిగా భావించి అన్నదాతల ఖాతాల్లో ఏకకాలంలో 9వేల కోట్ల రూపాయలను జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇది చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం గా మిగిలిపోతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రైతు నేస్తం ప్రారంభ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1031 రైతు వేదికలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడడం ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధతను చాటుతోందని ఎ మ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సోమవారం వనపర్తి మండలం నాగవరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రాయితీపై పనిముట్లు ,తుంపర సేద్యం పనిముట్లు, బిందు సేద్యం పనిముట్లు, రాయితీ విత్తనాలు, రాయితీ పంపుసెట్లు, అనేక పథకాల ద్వారా నేడు అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, జిల్లా విశాఖ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, పట్టణ మాజీ కౌన్సిలర్లు, వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.