22-08-2025 12:29:41 AM
అభినందించిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ ఆగస్టు 21: (విజయ క్రాంతి) : నిజామాబాదు జిల్లా లోని 9 మంది కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ లను జిల్లా సిపి సాయి చైతన్య అందజేశారు. ప్రమోషన్లు పొందిన వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాను సారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా తొమ్మిది మంది సిబ్బంది ప్రమోషన్ పొందారు .
ప్రమోషన్ పొందినవారు గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ను కలిశారూ. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబులు గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారరూ ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. సి.హెచ్. రాములు,
సిరికొండ పీఎస్ పి.కిరణ్ గౌడ్, పిసి ఇందల్ వాయి కె.కిషన్, డిచ్పల్లి పి.అర్జున్ నిజామాబాద్ రూరల్ పీఏస్ ఎస్.సత్పాల్ సింగ్, ,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్* టి.శ్రీనివాస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్*.డి. సింహ, రైల్వే (ఓడి) బి.శ్రీనివాస్ సైబర్ క్రైమ్ పి.ఎస్ నిజామాబాద్ ఏ క్రీష్ణయ్య , రైల్వే(ఓడీ) తదితరులు ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు.