6 May, 2026 | 8:56 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

హాస్టల్‌లో పురుగుల ఉప్మా!

03-12-2025 12:28 AM

-17 మంది విద్యార్థులకు అస్వస్థత

-ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

-గద్వాల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఘటన

గద్వాల, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయి, 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్‌లో ఉప్మాలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం పురుగులు పడిన ఉప్మా తిన్న తర్వాత హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లిన 17 మంది విద్యార్థుల్లో కొందరు ప్రేయర్ చేస్తుండగా, మరికొందరు తరగతి గదిలో కళ్లు తిరిగి కింద పడిపోయారు.

ఉపాధ్యాయులు హుటాహుటిన జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. 15 మంది విద్యార్థులకు ప్రథ మ చికిత్స అందించగా, ఇద్దరు విద్యార్థులకు ఐసీయూలో చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. టిఫిన్‌లో పురుగులు రావడంతో ప్రత్యామ్నాయంగా బిస్కెట్, అరటిపండు ఇవ్వడంతో కొందరు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారని తెలిపారు.

హాస్టల్‌లో విద్యార్థుల మెనూ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్ అప్రమత్తంగా ఉండి ఉప్మా రవ్వను పరిశీలించినట్లయితే ఈ సమస్య తలెత్తేదికాదని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అస్వస్థకు గురైన విద్యా ర్థులను మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత హాస్పిటల్‌లో పరామర్శించారు.