03-07-2025 01:51:54 AM
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదని, మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ కొత్తగా ఎన్నో అవకాశాలు సృష్టించిందని, ఈ మార్పును అందిపుచ్చుకొని తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తోందని వెల్లడించారు.
ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ను రూ పొందించుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని వివరించారు. బుధవారం టీ హబ్లో రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశం లో తొలి ఏఐ అనుసంధానిత ‘తెలంగాణ డే టా ఎక్స్ఛేంజ్(టీజీడెక్స్)’ను ఆయన లాంఛనం గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను అత్యుత్తమ ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆ దిశ గా అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
దేశంలో తొలి ఏఐ డేటా ఎక్స్ఛేంజ్..
ఏఐని ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకునేలా, అనేక సమస్యలకు పరిష్కా రం చూపించేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి దుద్దిళ్ల చెప్పారు. దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్సీ వ్యూహాత్మక సహకారం అందించిందని వెల్లడించారు.
ఇది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ డేటా ఎక్స్ఛేంజ్ అని పేర్కొన్నారు. ఇది కేవలం డేటా ప్లాట్ఫామ్ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాత్మ కమైన టెక్ పౌరసత్వానికి బలమైన పునాదిగా అభివర్ణించారు. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువత అంతా ఒకే వేదికపైకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు దారి చూపు తుందని వివరించారు.
ఎవరికీ ప్రయోజనం..
టీజీడెక్స్ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్కు డేటా లభిస్తుందని, రోగులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖకు అవసరమైన ఏఐ మోడల్స్ను అభివృద్ధి చేయొచ్చని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడుతుందని, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేలా నూతన ఆవిష్కరణలకు దిక్సూచిగా మారుతుందన్నారు. పౌర సేవలను సమర్థవంతంగా ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఐదేళ్లలో 2 వేల డేటా సెట్స్..
టీజీడెక్స్లో రాబోయే ఐదేళ్లలో 2వేల డేటాసెట్స్ను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. పాలనలో ఏఐ వి నియోగానికి పెద్దపీట వేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే పాఠశాల స్థాయి నుంచే నిపుణుల ను తయారు చేసేలా ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులమ్ను రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, సీఈవో జోగిందర్ తదితరులు ఉన్నారు.