మాదాపూర్ కాదు..
ఆసియా ఖండంలోనే ధనిక గ్రామం
ఆ గ్రామంలో 17 బ్యాంకులు
జైపూర్, ఆగస్టు 22: గ్రామం అనగానే రైతులు, కూలీలు, పేదలే గుర్తుకొస్తారు. కానీ గుజరాత్లోని ఓ గ్రామం ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతమైన పల్లెగా నిలిచింది. గుజరాత్లోని భుజ్ సరిహద్దుల్లో ఉన్న మాదాపూర్ గ్రామంలో చాలా మంది అంబానీలు, అదానీలు ఉన్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అందరూ ధనవంతులే కావటంతో ఈ గ్రామంలో ఏకంగా 17 బ్యాంకు శాఖలున్నాయి. వాటిల్లో వారికి రూ.7 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయట. ఈ గ్రామంలో చాలా మంది ధనవంతులున్నారు. ఈ గ్రామానికి చెందిన అనేక మంది వివిధ దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. తాము సంపాదించిన సొమ్మును స్వగ్రామంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటున్నారు. గ్రామంలో సుమారు 1200 కుటుంబాల వరకు వివిధ దేశాల్లోనే నివసిస్తుండడం గమనార్హం.






