23 April, 2026 | 2:51 PM

Breaking News

హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు   •   గుర్వాయిగూడెంలో అక్రమంగా మట్టి తరలింపు.. జేసీబీతో సహా 8 ట్రాక్టర్లు సీజ్   •   Karnataka SSLC Result 2026 Out: కర్ణాటక SSLC ఫలితాలు విడుదల   •   బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు   •   తమిళనాడులో 11 గంటల వరకు 37.56 శాతం పోలింగ్   •   ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే... సచివాలయం ముట్టడిస్తాం   •   తెలంగాణ‌లో రెండోరోజు ఆర్టీసీ స‌మ్మె.. మెట్రోలకు పోటెత్తిన ప్రయాణికులు   •   భగీరథుని ప్రయత్నం చరిత్రలో మహత్తర ఘట్టం   •   ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు   •   వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్   •  

కెనడాలో రైళ్లు బంద్

23-08-2024 12:15 AM

ఒట్టావా, ఆగస్టు 22: కెనడాకు చెందని ‘కెనాడా నేషనల్’, ‘ది కెనడా ఫసిఫిక్ కన్సాస్ సిటీ సదరన్’కు చెందిన సుమారు 9 వేల మంది కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగడంతో అమెరికా కెనడా మధ్య దిగుమతి, ఎగుమతి సేవలు నిలిచిపోయాయి. అమెరికాలోని వ్యవసాయ, ఆటోమొబైల్, గృహ నిర్మాణ, ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు రవాణా స్తంభించింది. దీంతో ఆయా ముడిసరుకులు అవసరమైన పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడే అవకాశం కనిపిస్తున్నది. అమెరికా కెనడా పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడడంతో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. 

అమెరికా నుంచి కెనడా సరిహద్దులకు సరఫరా అయ్యే క్లోరిన్ సైతం నిలిచిపోవడంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణ కష్టతరంగా మారనున్నది. రోడ్డు మార్గం నుంచైనా అవసరమైన సరుకులు రవాణా చేసేందుకైనా తగినన్ని ట్రక్కులు అందుబాటులో లేవు. దీంతో కార్మికులు సమ్మె విరమిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించని పరిస్థితి ఏర్పడింది. అండర్సన్ ఎకనామిక్ గ్రూప్ అంచనాల ప్రకారం సమ్మె కాలంలో సుమారు 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలిసింది.