2 July, 2026 | 3:21 PM

Breaking News

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •  

విద్యార్థులతో కలిసి భోజనం.. సమస్యలపై ఆరా..

26-09-2024 04:27 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పోషన్ చర్చ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచిన మేరకు పలువురు అధికారులు పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేస్తూ సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు.  పాఠశాలలోని రిజిస్టర్లను, రికార్డులను, వంటగదిని, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అరా తీసారు.

అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ మేరకు నూతన డైనింగ్ హాల్ నిర్మాణం, ఫర్నిచర్  ఏర్పాటు చేయాలని టీచర్స్, విద్యార్థులు అధికారికి సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేపట్టి, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో పాఠశాలలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్ కు విన్నవించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.