12 June, 2026 | 5:30 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి

12-06-2026 04:21 PM

- నేరేడుచర్ల ఎం.ఈ.వో. బాలు

నేరేడుచర్ల: పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల నందు మండల పరిధి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు.మధు,ఎల్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీ వారికి మధ్యాహ్న భోజన నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఈఓ ఎం బాలు మాట్లాడుతూ, విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం రుచికరంగా తయారుచేసి వడ్డించాలని, పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వంట సామగ్రి, వంటగది పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని మంచినీటి ట్యాంకుల శుభ్రతకోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు.