18 March, 2026 | 12:19 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

ఎల్‌ఎండీ గేట్లు ఎత్తిన అధికారులు

07-10-2024 12:00 AM

5 వేల క్యూసెక్కుల నీటి విడుదల

మానకొండూర్, అక్టోబరు 6: కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వస్తుండటంతో ఎస్సారెస్పీ అధికారులు ఆదివారం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గత నెలలో మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

మళ్లీ రిజర్వాయర్‌లో పూర్తి నీటి సామర్థ్యం ఉండటంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువకు రెండోసారి వదిలారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు మిడ్ మానేరు నుంచి రిజర్వాయర్‌లోకి వరద నీరు రావడంతో మూడోసారి గేట్లను ఎత్తారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ సామర్థ్యం 24.034 టీఎంసీలకుగాను 23.947 టీఎంసీల నీరు ఉంది. 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.