22 May, 2026 | 10:41 AM

కేటుగాళ్ల చేతిలో పాత ఫోన్లు.. 4వేల ఫోన్లతో సైబర్ నేరాలు

22-08-2024 11:31 AM

గోదావరిఖని:సైబర్ నేరాలకు పాల్పడే వారి కోసం పాత  సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని పెద్దపల్లి జిల్లా రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 4వేల ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనులను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ కృష్ణ మూర్తి తెలిసిన వివరాలివీ.. బిహార్ కు చెందిన కొంత మంది వ్యక్తులు ఎన్టీపీసీ మేడిపల్లి ప్రాంతంలో పాత ఫోన్లను తక్కువ ధరకు కొంటున్నారు. వాటికి బదులు ప్లాస్టిక్ వస్తువులు లేదంటే డబ్బులు ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు అందిన సమాచారం మేరకు అనుమానాస్సదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసున్నామని తెలిపారు. విచారణలో భాగంగా వారు హతియా దియారా ప్రాంతానికి చెందిన మహమద్ షమీమ్(30), అబ్దుల్ సలాం (28) మహమద్ ఇఫ్తెకార్(32)లుగా గుర్తించారు. రామగుండం చుట్టు పక్కల ప్రాంతాలలో నెల రోజులనుంచి  వారు పాత ఫోన్లు కొని తుక్కు దుకాణం యజమాని అక్తర్ అలీకి పంపిస్తున్నారు. అతడు సైబర్ నేరగాళ్ల కు విక్రయించగా వాటిని మరమ్మతు చేసుకుని వినియోగించుకుంటున్నారని సీఐ తెలిపారు. అక్తర్ అలీ పరారీలో ఉన్నాడని తెలిపారు. పాత ఫోన్లను విక్రయించవద్దని ాయన ప్రజలకు సూచించారు.