22 May, 2026 | 11:36 AM

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన.. ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

22-08-2024 11:24 AM

హైదరాబాద్‌: అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తోంది. అదానీ వ్యవహారంపై ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. సెబీ ఛైర్మన్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నిరసనకు దిగింది. సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు మాధబీ పురి బచ్ పై ఆరోపణలున్నాయి. అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాలు, యూటీల్లోని ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నిరసన చేస్తోంది. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొంటారని కాంగ్రెస్ వెల్లడించింది. ఈడీ కార్యాలయం వద్ద సీఎంతో సహా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.