31-05-2025 12:04:23 AM
-ఇందూరులో జోరుగా ఇసుక అక్రమ రవాణా
-కాంగ్రెస్ నేత లాబీయింగ్?చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
నిజామాబాద్, మే ౩౦ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మంజీరా తీరంలో ఇసుక అక్రమ రవాణ యదేచ్చ గా సాగుతోంది రేయింబగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు అనుమతితో కొందరు అనుమతి లేకుం డా మరికొందరు యదేచ్చగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు.
సంబంధిత అధికారు లు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలని ప్రజల కోరుతున్నారు.
ఇసుక అక్రమార్కులు సమమైన శైలిలో అక్రమ ఇసుక దందా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. మంజీరా పరివాహక ప్రాంతం నుండి రేయింపగలు ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇసుక తవ్వకాలతో పాటు రవాణా విషయంలో కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు ఒదిలి ప్రభుత్వ అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అక్రమ ఇసుక రావణ దారులు తాము ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నగర శివారుల లో ఇసుక డంపు లు ఏర్పాటు చేసుకొని జీరో దందా చేస్తున్నారు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డిడి రూపంలో చెల్లింపులు చేసి కాలేశ్వరం నుండి ఇసుక రవాణా చేస్తు తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నిజామాబాద్ లారీ ఓనర్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సదరు వ్యాపారులు ఫిర్యాదు చేశారు బోధన్ ఎడపల్లి రెంజల్ మండల్ లో స్థానిక ప్రజల అవసరాల వివిధ అభివృద్ధి కార్యక్రమాల కై ప్రభుత్వం ఖండుగావ్ సిద్దాపూర్ మందన్నా గ్రామాల వద్ద మంజీరా నదిలో ఇసుకతో ఎందుకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు ఇచ్చింది.
ఇదిలా ఉండగా ఇసుక ఇసుకనుతోలే వ్యాపారులు ఒకే కుప్పం పై రెండు మూడు ట్రిప్పులు అదనంగా కొడుతున్నారు పైగా సమీప ప్రాంతాల్లో డబ్బులు ఏర్పాటు చేసుకుని జీరో 100 కు తల లేపారు రెండు మండలాల్లోనీ నీలా పేపర్ మిల్ గ్రామాల వద్ద వాగు నుంచి అక్రమంగా ఇసుక తోడేసి డబ్బులు ఏర్పాటు చేసి ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు
పరిమితికి మించి ఓవర్లోడుతో ఇసుక తరలిస్తున్నారు తాసిల్దార్ ఇచ్చిన అనుమతి మేరకు ఇక్కడి నుంచి ఒక్కో ట్రిప్పు ఒక 105 టన్నుల 7 క్యూబిక్ మీటర్లు లోడు నింపాల్సి ఉండగా ఏకంగా 21 టన్నుల 14 క్యూబిక్ మీటర్ల తోటిపర్లు ఇసుకను రవాణా చేస్తున్నాయి రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ల బాడీని ఎత్తుకు రూపొందించి అదనంగా ఇసుకను నింపి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
సంబంధిత అధికారులు రాజకీయ ప్రమేయంతో ఒత్తిళ్లతో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో టిప్పర్ల ద్వారా ఇసుకను నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు యదేచ్ఛగా రవాణా చేస్తున్నారు ఇసుక రవాణా చేసే ప్రాంతంలో ప్రభుత్వం చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తే ఓవర్ రోడ్ వ్యవహారాన్ని అరికట్టే అవకాశం ఉంది.
టిప్పర్లను అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు సీపీ సాయి చైతన్య బాధ్యతలు చేపట్టిన అప్పటినుండి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికలోడుతో ఇసుకను రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను నిజామాబాదు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటివరకు ఈ అక్రమ లారీలపై కేసులు నమోదు చేయకుండా కేవలం మైనింగ్ శాఖ అధికారులచే జరిమానా వేయించి పంపించి వేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుడు ఒకరు ఈ అక్రమ ఇసుక రావనకు కీలకపాత్ర వహిస్తున్న తెలుస్తోంది.