calender_icon.png 12 June, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసును ఛేదించిన పోలీసులు....

31-05-2025 12:04:48 AM

నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు...

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ ఇండస్ట్రీస్ లోని కిసాన్ ఇండస్ట్రీస్ ఎస్ ఎల్ ఎల్ సి పి కంపెనీలో బ్రతుకుతెరువు నిమిత్తం పనిచేస్తున్నటువంటి కేరళ రాష్ట్రానికి చెందిన నలీన్ అనే వ్యక్తిని బండ్లగూడ నరేష్ కుమార్ తాగిన మైకంలో గొడవలో కొట్టి వేయడంతో నలీన్ అనే వ్యక్తి కింద పడిపోవడంతో తలకు భారీ గాయం కావడంతో చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండవ వ్యక్తి నరేష్ కుమార్ పరారీలో ఉండగా చాకచక్యంగా తూప్రాన్ సిఐ. రంగాకృష్ణ, మనోహరబాద్ సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బంది కలిసి పరారీలో ఉన్న దుండగుని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకొని శుక్రవారం రోజున అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ 24 గంటల్లో పరారీలో ఉన్న హంతకుని పట్టుకున్న సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బందిని అభినందించారు, నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.