31-05-2025 12:02:02 AM
కామారెడ్డి, మే 30, (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కడప జిల్లాలో జరిగిన తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి కామారెడ్డి జిల్లా నాయకులు పైడి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా టిడిపిని బలోపేతం చేసేందుకు టిడిపి నాయకులు కృషి చేయాలని తెలంగాణ ప్రాంత టిడిపి నాయకులను కోరారు.
జైరాబాద్ టిడిపి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ పైడి గోపాల్ రెడ్డి మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోపాల్ రెడ్డితో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి నాయకులను నిలబెట్టాలని అలాగే పూర్వ వైభవం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
టిడిపి నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా జిల్లా మొత్తం తిరిగి టిడిపిని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు పైడి గోపాల్ రెడ్డి తో పాటు జిల్లా టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.