16 March, 2026 | 9:04 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరి మృతి

14-01-2026 01:27 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు తన భార్య సుగుణ కొడుకు దుర్గాప్రసాద్ హైదరాబాద్లో జీవిస్తూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉండేవారని తెలిపారు.

గత రెండు నెలలుగా మృతుడు సాయిలు గ్రామంలో ఉంటూ వ్యవసాయపనులు చూసుకుంటున్నాడని తెలిపారు.ప్రతిరోజు తన కుమారుడికి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు అన్నారు.గత ఐదు రోజులుగా ఫోన్ రాకపోవడంతో గ్రామానికి రాగా గ్రామ శివారులోని లింగోశపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు మృతుని కుమారుడు ఫిర్యాదుల పేర్కొన్నారని ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.