13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరి మృతి

14-01-2026 01:27 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు తన భార్య సుగుణ కొడుకు దుర్గాప్రసాద్ హైదరాబాద్లో జీవిస్తూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉండేవారని తెలిపారు.

గత రెండు నెలలుగా మృతుడు సాయిలు గ్రామంలో ఉంటూ వ్యవసాయపనులు చూసుకుంటున్నాడని తెలిపారు.ప్రతిరోజు తన కుమారుడికి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు అన్నారు.గత ఐదు రోజులుగా ఫోన్ రాకపోవడంతో గ్రామానికి రాగా గ్రామ శివారులోని లింగోశపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు మృతుని కుమారుడు ఫిర్యాదుల పేర్కొన్నారని ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.