calender_icon.png 3 August, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలి

28-07-2025 12:53:35 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల అర్బన్, జూలై 27(విజయ క్రాంతి): రైతులు వేసిన పంటలకు అనుగుణం గా అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని, అవసరానికి మించి సరఫరా చేసినట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చ ర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు.ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల క్రయ విక్రయాలను ఆధార్ కార్డుతో ఎంట్రీ చేయాలని సూచించారు.రైతులకు అవసరమైన ఎరువులు అం దుబాటులో ఉన్నాయని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా పై యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాలను డాటా ఎంట్రీలో తనిఖీ చేశారు.

ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది ఎంత సరఫరా చేసాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోవాలని అధికారులనుజిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు 28 కోరమండల్, డిఏపి, యూరియా బస్తాలు ఎక్కువ పం పిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ వెంట జగిత్యాల మున్సిపల్ అధికారి స్పందన, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినీల సహకార పాక్స్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.