25-10-2025 03:28:05 PM
గోదావరిఖని,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1- టౌన్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, పౌరులు పొందాల్సిన సేవలు, డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాల గురించి, రిసెప్షన్, స్టేషన్ రైటర్, వీహెచ్ఎఫ్ సెట్, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, ఆయుధాలు భద్రపరచు రూమ్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని, మోటర్ వాహనాల చట్టాల గురించి, వివిధ రకాల బందోబస్తు గురించి, సమాజంలో పోలీసుల పాత్ర, కర్తవ్యాలపై విద్యార్థులకు సమాచారం అందిస్తూ, నేర నివారణలో పోలీసుల పాత్రను వివరించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
నేరస్తులను ఫింగర్ ప్రింట్ విధానం ద్వారా గుర్తుపట్టే టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలనీ, ఏదైనా సమస్యతో వచ్చే బాధితులకు కార్పొరేట్ స్థాయిలో భరోసా, నమ్మకం కలిగే విధంగా పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి బాధితుల సమస్య తెలుసుకొని వారు చెప్పిన సమస్యను తెలుసుకొని వారినిపై అధికారులను కలిపించడం త్వరితగతికన సమస్య పరిష్కారానికి చట్టపరిధిలో చూడడం జరుగుతుందని,
ఈ కార్యక్రమం వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు ఇంటికి వెళ్లగా తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు, బంధువులకి, చుట్టుపక్కల వారికి ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలని, పోలీసులు ఎప్పుడు ప్రజల రక్షణ కోసమే ఉన్నారని వారికీ తెలియచేయండని సూచించారు. చదువు ఒక్కటే విద్యార్థుల జీవితాలను మారుస్తుందని, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలియజేశారు.