02-06-2025 12:05:38 AM
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
ముషీరాబాద్, జూన్, 1 (విజయక్రాంతి): ఆపరేషన్ కాగారి పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నార. బాగ్ లింగం పల్లి సుందర విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్ లో ఆదివారం కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్ ను నిలిపి వేసి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీ తో శాంతి చర్చలకు పూనుకోవాలని శాంతి చర్చల (పీస్ డైలాగ్ కమిటీ ) ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశంనిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ నాయకురాలు పాశ్యపద్మ, మాస్ లేని రాష్ట్ర నాయకులు హన్మేష్, గాదగోని రవి, కే గోవర్ధన్ తదితరులు హాజరై మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన టీపిసిసి అధ్య క్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మా ట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఫాసిస్ట్ శైలిలో పాలన కొనసాగుతుందన్నారు. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఇది శాంతి రాజ్యాంగం పట్ల విధ్వంసకర చర్యగా భావిస్తున్నామన్నారు.
మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించిన చలించని ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్టికాయలు వేస్తే మాత్రం ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమయ్యారని అన్నారు. పాకిస్తాన్లో కాల్పులు విరమణకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తుందని ప్ర శ్నించారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబ డి వ్యవహరించాలనదే ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రం అన్నారు.
ఇలాంటి పరిస్థితులు లౌకికవాద శక్తులు ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కలిసి ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది దీంతోకేంద్రంలోని ఫాసిస్టు పాలనకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రసాద్,అన్వర్ ఖాన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.