01-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 31: పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, జమ్మూ కశ్మీర్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్లలో శనివారం సివిల్ డిఫెన్స్ నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. ‘ఆపరేషన్ షీల్డ్’ పేరు తో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన డ్రిల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలు భాగమయ్యా యి.
మొత్తంగా ఐదు రాష్ట్రాలు కలిపి 244 జిల్లాల్లో ‘ఆపరేషన్ షీల్డ్’ నిర్వహించినట్టు సివిల్ డిఫెన్స్ సిబ్బంది తెలిపింది. ఎల్వోసీ వెంట ఉన్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ షీల్డ్’ మాక్ డ్రిల్ను తలపెట్టారు. సివిల్ డిఫెన్స్ చేపట్టిన డ్రిల్స్లో భాగంగా బ్లాక్ అవుట్, మాక్ డ్రిల్ నిర్వహించారు.
మాక్ డ్రిల్ సమయంలో ఆయా రాష్ట్రాల్లో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూ మ్ల మధ్య హాట్ లైట్లు యాక్టివేట్ అయ్యా యి. ఇదే సమయంలో ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షించారు. ఆపరేషన్లో బాగంగా శ్రీనగర్ సిటీలోని లాల్చౌక్ వద్ద 10 నిమిషాల పాటు అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్లో అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా బయటపడాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహిం చింది.
ఇక అమృత్సర్, అహ్మదాబాద్, జైపూర్లోని ఖాతిపురా, జమ్మూలోని ఆక్నూ ర్, దోడా, పూంచ్ సహా తదితర ప్రాంతాల్లోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఆపరేష న్ సిందూర్ అనంతరం మే 7న దేశ వ్యాప్తం గా 255 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.