01-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 31: భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘వచ్చే వారంలో పాక్ ప్రతినిధుల బృందం వాషింగ్టన్ను సందర్శిస్తారు. భారత్-పాక్ దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటే ఆ దేశాలతో వాణిజ్యానికి ఆసక్తి చూపను.
వాణిజ్యం ద్వారా అణుయుద్ధాన్ని ఆపాం. ఇది ఎంతో గర్వకారణం.’ అన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చ ల్లో భాగంగా భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలే వాషింగ్టన్లో పర్యటించారు. జూలైలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశా లు ఉన్నాయి.
మే 27-29 మధ్య విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ కూడా అమెరికాలో పర్యటించారు. సుంకాల్లో భాగంగా అమెరికా భారత్ మీద 26 శాతం, పాకిస్థాన్ మీద 29 శాతం సుంకా లు విధించింది.
ట్రంప్ నోట.. మళ్లీ అదే మాట..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు తగ్గించానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కూడా అవే వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ నడుమ అణుయుద్ధం రాకుండా అమెరికానే నిలువరించిందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ట్రం ప్ మాట్లాడుతూ.. ‘భారత్-పాక్ల మధ్య గొడవను ఆపాం. అమెరికా మధ్యవర్తిత్వం వల్లే యుద్ధం అణుసంఘర్షణకు దారితీయలేదని నేను నమ్ముతున్నా.
రెండు దేశాల నాయకులకు, నా వద్ద పని చేస్తున్న అధికారులకు ధన్యవాదాలు. వారు చక్కగా పరి స్థితిని సద్దుమణిగేలా చేశారు. ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటే లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు.’ అని తెలిపారు. మరో పక్క పాకిస్థాన్తో కాల్పుల విరమణ లో మూడో పక్షం ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.