calender_icon.png 20 June, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనంపై విపక్షాలవి అసత్య ప్రచారం

09-08-2024 03:00:00 AM

కార్యకర్తలు నమ్మవద్దు: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ విలీనంపై విపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తమ పార్టీ పుట్టినప్పట్టి నుంచి విలీనమనే వ్యాఖ్యలు చేస్తున్నారని, అయిన తమ పార్టీ పదేళ్లు అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. ఈ పుకార్లను కార్యకర్తలు, నాయకులు నమ్మవద్దని, ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరగడంతో ప్రజలు మళ్లీ మార్పు కోరుకుంటారని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని మళ్లీ అదే వేగంగా బీఆర్‌ఎస్ పుంజుకుంటుందని గురువారం ఒక ప్రకటనలో ధీమా వ్యక్తంచేశారు.

ప్రస్తుతం తమకు ఏ కూటమిలో చేరే ఆలోచనలేదని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రస్తుతం పార్టీని వీడిన ఎమ్మెల్యేలంతా మళ్లీ గులాబీ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ వెంట ఉంటే ప్రజల్లో ఆదరణ ఉంటుందని పలు సందర్బాల్లో పేర్కొనట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌ను ఏమి చేయలేరని స్పష్టంచేశారు.