23 April, 2026 | 12:09 PM

మారుతిని పరుగులు తీయించిన ఒసామా సుజుకి కన్నుమూత

28-12-2024 12:40 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భార త ఆటోమొబైల్ పరిశ్రమకు అపా ర భవిష్యత్ ఉందన్న విశ్వాసంతో మారుతి సుజుకిని దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దిన ఒసామా సుజుకి కన్నుమూశారు. 94 ఏండ్ల వయస్సున్న ఒసామా అనారోగ్య సమస్యలతో డిసెంబర్ 25న కన్నుమూసినట్లు జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ శుక్రవారం తెలిపింది.

దేశంలో లైసెన్స్‌రాజ్ కొనసాగుతున్న 1980 దశకంలోనే సుజుకి రిస్క్ తీసుకుని భారత ప్రభుత ్వంతో కలిసి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను నెలకొల్పడానికి ఒసామాయే కారణం. 2007లో జాయింట్ వెంచర్ నుంచి ప్రభు త్వం పూర్తిగా వైదొలగడంతో మారు తి ఉద్యోగ్ లిమిటెడ్ మారుతి సుజుకి ఇండియాగా మారింది.

మారుతి సుజుకి ఇండియాకు ఒసామా సుజుకి డైరెక్టర్, గౌరవ చైర్మన్‌గా ఉన్నారు. ఒసామా లేకుండా ఇండి యా ఆటోమొబైల్ పరిశ్రమలో ఇంతటి శక్తి గా ఎదిగేదికాదని తాను భావిస్తున్నట్లు మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ నివాళులు అర్పించారు.