20-12-2025 01:27:35 AM
సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండ
స్థానిక నాయకుల తీరుతోనే పొత్తు చెడింది
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19, (విజయక్రాంతి): గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్క సారిగా మూతపడ్డాయని, గెలిచిన సిపిఐ సర్పంచ్లు, వార్డు సభ్యులు నిస్వార్ధంగా, పారదర్శకంగా ప్రజారంజక పాలన అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఏ కూ నంనేని సాంబశివరావు అన్నారు. నూతనం గా గెలుపొందిన సర్పంచ్లు, వార్డుసభ్యుల అభినందన సభ శుక్రవారం స్థానిక కొత్తగూ డెం క్లబ్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా విచ్చేసిన కూనంనేని మాట్లాడుతూ గెలిచిన సిపిఐ అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయితీల్లోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండాగా ఉండాలని సూచించా రు. పోటా పోటీగా ఒంటరి పోరుకు దిగిన సిపిఐ జిల్లా వ్యాప్తంగా 47 సర్పంచ్స్థానాల ను మంచి మెజార్టీతో గెలుచుకుందని, అదే విధంగా 57 ఉపనర్పంచ్ పదవులు దక్కించుకోగా, 432 వార్డుల్లో ఎర్రజెండా రెపరెప లాడుతోందన్నారు.
మేజర్ గ్రామ పంచాయితీలను సైతం సిపిఐ ఖాతాలో వడ్డాయని తెలిపారు. తాము కాకలు తీరిని రాజకీయ పండితులం అని చెప్పుకునే వారి ప్రాంతా ల్లో కూడా సిపిఐ దూసుకుపోయిందని, కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే సిపిఐకి అత్యధిక ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ముగిసిన ఎన్నికల్లో సిపిఐకి కాంగ్రె స్ పార్టీ కనీసం మద్దతు తెలపలేదని, కానీ సిపిఐ స్నేహధర్మాన్ని పాటిస్తూ గతంలో కాంగ్రెస్ నర్పంచ్లు ఉన్న స్థానాల్లో తాము పోటికి నిలుపలేదని చెప్పారు.
అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితూ దిగజారుడు రాజకీయాలు చేశారని, విలువలతో కూడుకున్న రాజకీయాలు, క్రమశిక్షణతో ఉన్న తాము తప్పిదాలకు తావివ్వ లేదని చెప్పారు. కొందరు సిపిఐది ఏముందిలే, గత అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిపిం చాం, వాళ్లకు అంత సీన్ లేదంటూ అవాకులు చెవాకులు పేలారని, కానీ దిమ్మదిరిగే ఫలితాలు సొంత కావడంతో ఇప్పుడు వారు ఎక్కడున్నారో కూడా అంతు చిక్కడం లేదని యద్దేవా చేశారు. ఇప్పటికైనా మాటలు జార డం మానుకుని స్నేహ బంధాన్ని నిలుపుకుంటే మంచిదని హితవు పలికారు.
త్వరలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ తర్వాత మున్సిపాలిటీ, కార్పోరే షన్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా సిపిఐ దే పై చేయని, ఆ నాటి రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల రాష్ట్ర పెద్దల నిర్ణయాల మేరకు కార్యచరణ ఉంటుందన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని, ఓటమి పాలైన వారు కృంగిపోకుండా రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు మనోధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగాల ని సూచించారు.
అనంతరం గెలుపొందిన సర్పంచులు ఉపసర్పంచులతో పాటు వార్డు సభ్యులకు మెమొంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గసభ్యులు సలిగం టి శ్రీనివాస్, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, దుర్గారాసి వెంకటేశ్వర్లు, వి.పూర్ణచందర్ రావు, మున్నా లక్ష్మికుమారి, కే సారయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, రేసు ఎల్లయ్య, ఎస్ డి సలీం, చండ్ర నరేంద్ర కుమార్, వాసిరెడ్డి మురళి, మువ్వా వెంకటేశ్వరరావు, బం ధం నాగయ్య, ఉప్పుశెట్టి రాహుల్, మండల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.