15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

'సమ్మక్క -సారక్క'లకు ముడుపులు చెల్లించిన పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి

27-04-2025 02:48 PM

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు విజయవంతం కావాలని దేవతామూర్తులకు వేడుకోలు 

పెన్ పహాడ్ : సమైక్యాంధ్ర పాలకుల చేతిలో ఎడారిగా మారిన తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కీలకంగా మారిందని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటలో నిలిచిపోవడమే కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారని పిఎసిఎస్ చైర్మన్ వెన్నె సీతారాం రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన సభ విజయవంతం కావాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురంలో కొలువుతీరిన సమ్మక్క- సారక్క దేవతామూర్తులకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కుందూరు ప్రభాకర్ రెడ్డి, బిక్షం రెడ్డి, మాజీ ఎంపిటిసి రామ చంద్రు, నాయకులు కుందూరు వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, బండి వెంకటరెడ్డి, సొంటి రవి గుండు శ్రీను తదితరులు ఉన్నారు