పద్మశ్రీ మొగులయ్యను సన్మానించిన పొన్నం
14-06-2024 12:08 AM
పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు మొగులయ్యను రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గురువారం సచి వాలయంలోని తన చాంబర్లో మొగులయ్యను సన్మానించి ఆయన కళను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా భీమ్లానాయక్ సినిమాలో తాను పాడిన పాటను మొగులయ్య మంత్రికి వినిపించారు.






