31-05-2025 12:01:52 AM
కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్
ఖైరతాబాద్;మే 30 (విజయక్రాంతి) : తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైదరాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ఉన్న బాపూజీ విగ్రహం వద్ద సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, ఫెడరేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి పెద్ది జగదీష్లు ఇందుకు సంబంధించిన బ్రోచర్న ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 1969 సంవత్సరంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక క్యాబినెట్ మంత్రి పదవిని తృణప్రా యంగా భావించి రాజీనామా సమర్పించిన గొప్ప త్యాగమూర్తి కొండ బాపూజీ అని కొనియాడారు.
1990లో మొదలైన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి పలు దఫా లుగా ఉద్యమాన్ని నడిపిస్తూ అందరికీ మార్గనిర్దేశం చేశారని అన్నారు. 2001 సంవత్స రంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన నివాసం జలదృశ్యంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చి తన సర్వ స్వం త్యాగం చేసిన మహనీయుడు అని తెలిపారు. 97 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో నిరాహార దీక్ష కొనసాగించి తెలంగాణ పట్ల తన నిబద్ధతను చాటిన గొప్ప పోరాట యోధుడని తెలిపారు.
కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంలో ఉండి కూడా ఒక సొంత ఇంటిని నిర్మించుకోని మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు రఘురాం, యాదగిరి, చంద్రమోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.