13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు

20-01-2026 01:15 AM

ఆదిలాబాద్, జనవరి 19 (విజయక్రాంతి):  మైనర్లకు డ్రైవింగ్ కోసం వాహనాలు ఇచ్చిన వాహన యజమానులు, తల్లిదండ్రులు సైతం కేసులలో భాగస్వామ్యం అవుతారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా 18 ఏండ్ల లోపు పిల్లలు (మైనర్లు) లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికాకుండా జిల్లాలో మైనర్ డ్రైవింగ్ చేసిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని తల్లిదండ్రులకు, యువతకు, మైనర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇక నుంచి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 261 మైనర్లు వాహనాలతో పట్టుబడ్డారని, 261 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎ.ఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐ లు సునీల్ కుమార్, నాగరాజు, ప్రణయ్ కుమార్, ఫణిదర్,  ట్రాఫిక్ ఎస్‌ఐలు దేవేందర్, మహేందర్ పాల్గొన్నారు.