లోక్సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్
న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ సమస్య, కొత్త క్రిమినల్ చట్టాలపై గందరగోళం మధ్య సోమవారం పార్లమెంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించిన తర్వాత పలువురు ప్రతిపక్ష సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చను చేపట్టాల్సి ఉండగా, నీట్పై ప్రత్యేక చర్చ జరగాలని ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. నీట్పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. 24 లక్షల మంది అభ్యర్థులతో మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) నీట్-యూజీ నిర్వహించింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రశ్నపత్రం లీకేజీలు, ఇతరత్రా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నీట్ అక్రమాల అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు.






