18 July, 2026 | 6:25 PM

Breaking News

తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •  

లోక్‌సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్‌

01-07-2024 12:05 PM

న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ సమస్య, కొత్త క్రిమినల్ చట్టాలపై గందరగోళం మధ్య సోమవారం పార్లమెంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించిన తర్వాత పలువురు ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చను చేపట్టాల్సి ఉండగా, నీట్‌పై ప్రత్యేక చర్చ జరగాలని ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. నీట్‌పై చర్చకు స్పీకర్‌ అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేశారు. 24 లక్షల మంది అభ్యర్థులతో మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) నీట్-యూజీ నిర్వహించింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రశ్నపత్రం లీకేజీలు, ఇతరత్రా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నీట్ అక్రమాల అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు.