17 June, 2026 | 11:52 AM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

మెడిసిటీ ఆస్పత్రి వద్ద రోగి బంధువుల ఆందోళన

20-12-2025 01:12 AM

మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 19(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని మెడిసిటీ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళను ఆపరేషన్ చేసి వైద్యులు మధ్యలో వదిలేశారని బంధువులు ఆసుపత్రి ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు.అలియాబాద్ కు చెందిన పుష్పలత అనే మహిళ గత నాలుగు రోజుల క్రితం మెడిసిటీ ఆసుపత్రిలో హెర్నియా సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు బంధువులు తెలియజేశారు.

ఆసుపత్రిలో మహిళను అన్ని టెస్టులు చేసి సర్జరీ చేస్తామని చెప్పి సర్జరీ మధ్యలోనే ఆపేసి సరైన పరికరాలు లేవని చేతులెత్తేసినట్లు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో మహిళను సర్జరీ చేసి మధ్యలోనే వదిలేసి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్ళమని కుటుంబ సభ్యులను మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు ఒత్తిడి చేశారని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగినట్లు చెప్పారు.