9 April, 2026 | 8:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బెంగళూరుపై పట్నాదే పైచేయి

20-11-2024 12:00 AM

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్ 11వ సీజన్)లో పట్నా పైరేట్స్ ఏడో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం నోయి డా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పట్నా 54- 31 తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పట్నా స్టార్ దేవాంక్ దలాల్ 16 పాయింట్లతో రాణించాడు. పునేరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయం ముగిసే లోగా ఇరుజట్లు 29-29తో నిలిచాయి.

పల్టన్ జట్టులో కెప్టెన్ పంకజ్ 9 పాయింట్లు సాధించగా.. యూపీ తరఫున రెయిడర్ భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్ల తో మెరిశాడు. పునేరి జట్టుకు ఇది మూడో డ్రా కాగా.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో యు ముంబా, దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది.