పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు రాహుల్ గాంధీ చిత్రపటం బహూకరణ
బడంగ్పేట్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి బుధవారం కలిశారు. నార్సింగి లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్లిన ఆయన, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు శాలువా కప్పి సత్కరించడంతో పాటు, రాహుల్ గాంధీతో కలిసి దిగిన ఒక అపురూప చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై వారి మధ్య చర్చ జరిగిందని క్షేత్రస్థా యిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిసిసి సూచించినట్లు ఆయన పేర్కొ న్నారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




