గంజాయి కేసులో పీడీయాక్ట్
31-03-2026 01:36 AM
ఏడాదిపాటు జైలు శిక్ష
బూర్గంపాడు, మార్చి30 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన షేక్ మున్వర్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నందుకు 2024, 2025లో వివిధ జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో అతనిపై పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ సూచ నలతో పీడియాక్ట్ నమోదుచేశారు. సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా ౨౦౨౬ ఫిబ్రవరి 16న డిటెన్షన్ ఆర్డర్ను జారీచేశారు.
18న డిటెన్షన్ ఆర్డర్ ప్రతులను షేక్ మున్వర్కు అందజేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. మార్చి 17న అడ్వైజరీ బోర్డు షేక్ మున్వర్పై వచ్చిన నిర్భంద ఉత్తర్వులపై విచారణ జరిపి భౌతిక, ఆధారాలను పరిశీలించి, పీడీయాక్ట్ను సమర్థిస్తూ, సంవత్సర కాలం చర్లపల్లి జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




