calender_icon.png 16 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ లైబ్రరీ సెస్సు వెంటనే చెల్లించాలి

16-09-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య

వనపర్తి, సెప్టెంబర్ 15 ( విజయక్రాంతి ) జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ లైబ్రరీ సెస్ను వెంటనే చెల్లించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో పెండింగ్ లైబ్రరీ సెస్ చెల్లింపు అంశంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు సామాజిక ఆస్తులని, కాబట్టి వాటిని సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్ లైబ్రరీ సెస్ను వెంటనే చెల్లించాలని అన్నారు.

ప్రాపర్టీ దారులు కట్టే టాక్స్ లో 8 శాతం గ్రంథాలయాలకు వెళ్తుందని, అది సకాలంలో గ్రంథాలయాలకు చేరితేనే సరైన నిర్వహణ ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన పెండింగ్ సెస్ బకాయిలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ అంశంపై నెలాఖరులో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అప్పటిలోపు సంబంధిత అధికారులు తమ పరిధిలోని గ్రంథాలయాల సెస్ పెండింగ్ బకాయిలపై పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు.సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.