మద్యం సేవించిన 16 మంది అరెస్టు
12-07-2026 12:00 AM
ముషీరాబాద్, జూలై 1౧ (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనం నడిపిన 16 మందిని నాంపల్లిలోని ఎంఆర్ కాంప్లెక్స్లో ఉన్న 10వ జేఎంఎఫ్ సి కోర్టు మెజిస్ట్రేట్ ముందు వచ్చినట్లు చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు శనివారం తెలిపారు. వీరిలో 10 మందికి జరిమానా విధించబడిందని, నలుగురికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేసే శిక్ష విధించబడిందన్నారు.
అలాగే మూడవసారి ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు ఐదు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడిందని తెలిపారు. మొత్తం రూ.97,000 జరిమానా వసూలు చేయబడిందని ఇన్స్పెక్టర్ ఏడుకొండలు తెలిపారు.






