17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 02:19 PM

ఎస్సై గూగులోతు శ్రీదేవి

తరిగొప్పుల,(విజయక్రాంతి) మండలం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తరిగొప్పుల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని. ఎస్సై శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. నీటి సమీపంలో ఉండే వంతెనలు, కట్టలు దాటవద్దని, జలపాతాలు, వాగులు, చెరువులకు వెళ్ళవద్దని, ఎలక్ట్రిక్ పోళ్లు,వైర్లను తాకవద్దని సూచించారు. పాత ఇళ్లల్లో ఉండకూడదని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, రైతులు చెట్ల కింద, కరెంటు వైర్ల కింద ఉండొద్దని చెప్పారు. మొoథా తుఫాను ప్రభావంతో ప్రజలందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.