జార్ఖండ్లో శతాధిక ఓటర్లు @ 900
19-10-2024 01:23 AM
మొదటి దశలో
43 స్థానాలకు పోలింగ్
రాంచీ, అక్టోబర్ 18: జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ లో 43 స్థానాలకు గాను శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2.60 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించు కునేందుకు అర్హులు కాగా వారిలో 11.84 లక్షల మంది తొలిసారి తమ ఓటుహక్కును వినియోగించుకోను న్నారు. అయితే తొలిదశలో 100 ఏళ్లు పైబడిన 900 మంది ఓటర్లు ఉండగా అందులో 533 మంది మహిళలు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.






