13 March, 2026 | 4:36 AM

పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులకు అనుమతులు ఇవ్వాలి

13-03-2026 12:21 AM

మానుకోట ఎంపీ బలరాం నాయక్ 

మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, మహబూబాబాద్ జిల్లా కేంద్రం, డోర్నకల్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పనులకు కేంద్రం అనుమతి మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కలిసి విజ్ఞప్తి చేశారు.

గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన రహదారుల అంశంపై కేంద్ర మంత్రితో ఎంపీ చర్చించినట్లు చెప్పారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తపరిచినట్లు ఎంపీ తెలిపారు. ఎంపీ వెంట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు.