4 August, 2026 | 9:54 PM

పటాకుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి

29-10-2024 06:16 PM

జనగామ (విజయక్రాంతి): దీపావళిని పురస్కరించుకుని పటాకుల షాపులు ఏర్పాటు చేయదలిచే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలని జనగామ స్టేషన్​ హౌజ్​ ఆఫీసర్​ దామోదర్​రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం మాత్రమే బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దుకాణంలో కచ్చితంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధలను అతిక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.