12-12-2025 05:01:01 PM
సర్పంచ్ అభ్యర్థి పెరుగు లింగయ్య యాదవ్
మోతే,(విజయక్రాంతి): గోపతండ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే గోపతండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పెరుగు లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోపతండ గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి పెరుగు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో గోపతండ గ్రామస్తుల ఆశీస్సులతో గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందన్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు, కష్టపడతానని గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్ల, డ్రైనేజీ పనులను, అర్హులైన వారికి పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పెరుగు లింగయ్య యాదవ్ తెలిపారు.